Saturday 31 December 2016

Using the Generate Keywords Tool in Search Engine Visibility

Search Engine Visibility provides an easy-to-use keyword generator. Using the best keywords or phrases will help to improve your website's visibility and search engine rankings. To use the keyword generator you need to enter words and phrases that describe your site content. The tool then generates ideal keywords for you to incorp
orate into your site.


To Use the Keyword Generator Tool in Search Engine Visibility

Log in to your GoDaddy account.

Click Search Engine Visibility V1.

Click Manage for the account you want to use. The Search Engine Visibility Manager opens.

From the Optimize tab, click Generate Keywords, and then click Get Started.

For each of your website's pages, enter words or phrases that describe the content. Use commas to separate keywords.

Click Generate.

The keyword generator tool displays recommended keywords that visitors enter to search Google® and other search engines.


To Select Keywords

Use the rating scale to select keywords with low to moderate search engine competition. You can click a keyword, and then click See search trend to see how frequently visitors enter each keyword in search engines.


In Keywords Being Searched area, sort the list as desired.

Click Save Keyword to add the keyword to the Saved Keywords list. You can add up to a total of 15 keywords per page.

Click Manually add a keyword to enter additional keywords or phrases not already listed.

(Optional) Click the Suggested Content tab to see what people are searching for to find sites like yours. Writing articles or blog posts on your site that target these searches improve SEO performance.

Click Next Page to generate and save keywords for additional pages on your site.

Click All Finished.

Click Download keyword list to download a .TXT file of your saved

జయ ఆశయాల కోసం పనిచేస్తా: శశికళ

అమ్మే మన ధైర్యం, శక్తి అని అన్నాడీఎంకే నూతన జనరల్‌ సెక్రటరీ శశికళ అన్నారు. అమ్మ ఆశయాల సాధనకు పనిచేస్తానని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. జయలలిత ఎప్పటికీ పార్టీ కార్యకర్తల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఆమె స్థానం మరో వెయ్యేళ్లైనా ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆమె మరణాన్ని వూహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కోలుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చిందని వివరించారు.
జయలలితతో తనకు 33ఏళ్ల అనుబంధం ఉందని, ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి తాము సన్నిహితంగా ఉన్నామని శశికళ తెలిపారు. ప్రజల కోసమే అన్నాడీఎంకే ఉందన్నారు. జయలలిత మరణానంతరం శశికళ తొలిసారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జయలలిత కార్యకర్తలను కలుసుకునేందుకు ఉపయోగించే బాల్కనీలోకి వచ్చి మాట్లాడారు. పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే ఆరో జనరల్‌ సెక్రెటరీగా ఎన్నికైన శశికళ ఆ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ. ఆమె వయసు 62 సంవత్సరాలు.
ఎంజీఆర్‌ పేరున ప్రత్యేక స్టాంపు, నాణెం విడుదల చేయాల్సిందిగా పార్టీ తరఫున కేంద్రాన్ని కోరుతామని శశికళ ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే సంవత్సరం ఎంజీఆర్‌ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 33 ఏళ్లపాటు జయలలిత వెంట వుంటూ ఎన్నో సమావేశాల్లో పాల్గొన్న తాను ఇలా ఒంటరిగా ఈ సమావేశంలో పాల్గొనాల్సివస్తుందని వూహించలేదంటూ కంటతడి పెట్టారు.

అఖిలేశ్‌పై బహిష్కరణ ఎత్తివేత

సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. అఖిలేశ్‌యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై బహిష్కరణను ఎత్తివేస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వీరిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ శుక్రవారం సాయంత్రం పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
బలప్రదర్శనే కారణమా?
పార్టీ నుంచి బహిష్కరణ నేపథ్యంలో శనివారం ఉదయం అఖిలేశ్‌ తన నివాసంలో అనుచరులతో సమావేశం ఏర్పాటుచేయగా 229 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హాజరైన వారి సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా 229 మంది వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అఖిలేశ్‌ పార్టీలో తన సత్తా నిరూపించుకోవడానికి ఈరోజు సాయంత్రం కూడా అనుచరులతో మరోసారి భేటీ కావాలనుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం అనుచరులతో కిక్కిరిసి ఉన్నాయి. ప్రముఖులతో వరస సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నుంచి మళ్లీ బహిష్కరణ ఎత్తివేత కబురు వచ్చింది.
: యూపీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి.. బాబాయ్‌లతో ముఖ్యమంత్రి అఖిలేష్‌ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అవెంత వరకు వెళ్లాయంటే ముఖ్యమంత్రిగా ఉన్న కొడుకును పార్టీ నుంచి బహిష్కరించేందుకు సైతం ములాయం వెనుకాడలేదు.. గత కొంత కాలంగా తండ్రి.. కొడుకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తయారుచేసిన పోటాపోటీ అభ్యర్థుల జాబితాతో ఈ వ్యవహారం మరింతగా ముదిరిపోయింది. యూపీ అధికారపక్షంలో నెలకొన్న తాజా సంక్షోభం వెనుక అపర్ణా యాదవ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ.. ఈ అపర్ణా యాదవ్‌ ఎవరు? ఆమెకు సమాజ్‌వాదీ సంక్షోభానికి కారణం ఏమిటి? ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం అన్న అంశాల్ని చూస్తే..
యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తండ్రీ కొడుకులు విడివిడిగా పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంతో మరోసారి సంక్షోభానికి తెరలేచింది. అయితే అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించిన జాబితాలో లఖ్‌నవూ కంటోన్మెంట్‌ సీటు అభ్యర్థి పేరు లేకపోవటం రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురి చేశాయి. వారు అంతగా ఆశ్చర్యపోవటానికి కారణం లేకపోలేదు. ఆ సీటు అభ్యర్థిగా ఏడాది కిందటే అపర్ణాయాదవ్‌ పేరును ఎస్పీ చీఫ్‌ ములాయం రిజర్వు చేశారు. అలాంటిది అఖిలేశ్‌ మాత్రం తాను సమర్పించిన జాబితాలో అపర్ణ పేరును చేర్చలేదు.
ఆమె ఎవరంటే..?
ఇరవైఆరేళ్ల వయసున్న అపర్ణా యాదవ్‌ ఎవరోకాదు ములాయం సింగ్‌ యాదవ్‌ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ భార్య. ప్రతీక్‌ యాదవ్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ వ్యాపారంలో ఉండటంతో అపర్ణాయాదవ్‌ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆమెను లఖ్‌నవూ కంటోన్మెంట్‌ సీటుకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో రీటా బహుగుణా జోషీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. లఖ్‌నవూ ప్రధాన సీటును ఎస్పీ ఇంతవరకు గెలుచుకోలేదు. అందుకే ఆమె రాజకీయ అరంగేట్రం సాఫీగా సాగేందుకు ఈ సీటును కేటాయించారు. ఏడాది నుంచే ఆమె తన ప్రచారాన్ని మొదలు పెట్టారు.
ఆమె వ్యూహం ఏంటీ..?
ఎస్పీలో యువనేతగా ఎదగడమే లక్ష్యంగా అపర్ణ రాజకీయాల్లోకి దిగుతున్నారు. అవసరమైతే అఖిలేష్‌ స్థానాన్ని ఆమె భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కాలం కలిసి వస్తే.. అఖిలేశ్‌ను తోసిరాజనేందుకు వీలుగా అపర్ణకు అధినేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెబుతుంటారు. ప్రస్తుతం ఆమె శివ్‌పాల్‌ యాదవ్‌ వర్గంలో ఉన్నారు.
అఖిలేష్‌ను ములాయం కుటుంబ సభ్యులు లక్ష్యంగా చేసుకున్నారంటూ కొన్నాళ్ల కిందట ఎస్పీ నేత ఉదయ్‌వీర్‌ సింగ్‌ ఓ లేఖను విడుదల చేశారు. ఇది పరోక్షంగా అపర్ణా యాదవ్‌ను ఉద్దేశించిందన్న అభిప్రాయం ఉంది. ఈ లేఖపై ములాయం.. సాధనగుప్తాలు అగ్గి మీద గుగ్గిలం కావటం ఒక ఎత్తు అయితే.. అఖిలేష్‌కు ములాయంకు మధ్య విభేదాలను అపర్ణ భర్త ప్రతీక్‌ ఎగదోస్తున్నారని యూపీ సీఎం వర్గం ఆరోపిస్తోంది.

 మోదీ మద్దతుదారు..!
అపర్ణ ప్రధాని నరేంద్రమోదీకి మద్దుతుదారు. ఆమె ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట బహిరంగంగానే చెప్పారు. 2015లో ములాయం మనవడి వివాహానికి మోదీ హాజరైనప్పుడు భర్తతో కలిసి వెళ్లి సెల్ఫీ దిగారు. భాజపా కార్యక్రమాలకు కూడా ఆమె మద్దతు ఇస్తుంటారు.

ఆమెకు పోటీ ఎవరు?
అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ను అపర్ణాయాదవ్‌కు ప్రత్యర్థిగా పలువురు అభివర్ణిస్తుంటారు. పార్టీ కార్యక్రమాల్లో బాగా కష్టపడతారన్న పేరు డింపుల్‌కు ఉంది. కుటుంబంలో చోటు చేసుకున్న లుకలుకలు ఇప్పుడు పార్టీని సంక్షోభం దిశగా నడిపించటమే కాదు.. ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు విజయం మీద ప్రభావితం చూపించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చి..
యూపీ రాజకీయ సంచలనమైన అపర్ణా యాదవ్‌ బిష్త్‌ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి అరవింద్‌ సింగ్‌ బిష్త్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా లఖ్‌నవూ బ్యూరో చీఫ్‌. అపర్ణ లఖ్‌నవూలోని ఓ ప్రఖ్యాత పాఠశాలలో చదువుకున్నారు. అక్కడే ప్రతీక్‌ యాదవ్‌ కూడా చదువుకున్నారు. కానీ అప్పట్లో ప్రతీక్‌ యాదవ్‌కు ములాయంకు మధ్య సంబంధం లోకానికి తెలియదు. వీరి బంధాన్ని 2007లో ములాయం బయటపెట్టారు. అపర్ణ, ప్రతీక్‌లు తొలుత సన్నిహిత మిత్రులు. తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రతీక్‌ నేపథ్యం తెలియకుండానే దగ్గరయ్యారు. ఆమె తొలిసారి ప్రతీక్‌ తల్లివద్దకు వెళ్లినప్పుడే ములాయం కుమారుడన్న విషయం తెలిసింది. అప్పట్లో వీరి ప్రేమను అపర్ణ తండ్రి అరవింద్‌ అంగీకరించలేదు. వీరిద్దరు ఇంగ్లాండ్‌లో ఉన్నత చదువులు అభ్యసించారు. అపర్ణ అంతర్జాతీయ సంబంధాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయగా ప్రతీక్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ చేశారు. అపర్ణ, ప్రతీక్‌ల పెళ్లికి ములాయం అంగీకరించకపోవడంతో.. సాధన గుప్తా భర్తను ఒప్పించాల్సి వచ్చింది. అనంతరం వీరి పెళ్లిని ములాయం ధూంధాంగా నిర్వహించారు. ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే అత్యంత వైభవంగా జరిగిన పెళ్లిగా చెప్పుకొంటారు.

 

Friday 30 December 2016

తండ్రీకొడుకుల సవాల్ : పార్టీ నుంచి సీఎం అఖిలేష్ బహిష్కరణ

స‌మాజ్‌వాదీ పార్టీలో ముస‌లం ముదిరింది. క‌న్న కొడుకునే పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు పార్టీ అధినేత ములాయం సింగ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు బాబాయ్ అబ్బాయ్ మ‌ధ్యే న‌డిచిన వార్ ఇక తండ్రీ కొడుకుల కొట్లాట‌గా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాది అభ్య‌ర్థులు జాబితాతో విబేధించిన సీఎం అఖిలేష్ యాద‌వ్, త‌న సొంత అభ్య‌ర్థుల‌తో మ‌రో జాబితాను విడుద‌ల చేశారు. దీంతో అగ్గిరాజేసుకుంది.
పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందున అఖిలేష్‌, రాంపాల్ యాద‌వ్‌ల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ములాయం. నోటీసులు జారీ చేసిన కాసేప‌టికే ప్రెస్‌మీట్ పెట్టి స‌మాజ్‌వాదీ పార్టీ  పెద్దాయన సీఎం అఖిలేష్‌ను, రాంగోపాల్‌ను పార్టీ నుంచి 6ఏళ్లు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
రాంగోపాల్ మొద‌టి నుంచి పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, అఖిలేష్‌ను సైతం త‌ప్పుదోవ ప‌ట్టించాడ‌ని ములాయం చెప్పారు. అఖిలేష్‌ను స‌స్పెండ్ చేయ‌డం బాధించింద‌ని అయితే పార్టీ మేలు కోరి ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ములాయం అన్నారు. దీంతో అఖిలేష్ సీఎం ప‌ద‌వి ప్ర‌శ్నార్థ‌క‌మైంది. దీంతో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు వేడెక్కాయి. అఖిలేష్ మ‌రో పార్టీ పెడ‌తార‌న్న వార్త‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి.
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం పెమా ఖండూను ఆ పార్టీ ఎమ్మెల్యేలే స‌స్పెండ్ చేసిన కొన్ని గంట‌ల‌కే… స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన సీఎం అఖిలేష్‌ను పార్టీ చీఫ్ తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

వివాదాస్పద ఇళ్ల నుంచీ ఆస్తి పన్ను
జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
ఇలాంటివి మహా నగరంలో లక్షకు పైగా ఇళ్లు
దీనివల్ల యాజమాన్యపు హక్కు ఇచ్చినట్లు కాదు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వివాదంలో ఉన్న లక్షకుపైగా ఇళ్లకు ఆస్తి పన్ను వేసి వసూలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బల్దియాకు ఏటా రూ.40 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్‌ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వివాదాల మధ్య నలుగుతున్న ఇళ్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. మియాపూర్‌లోని గోకుల్‌ ట్రస్టు పరిధిలో దాదాపు రెండువేల ఇళ్ల వరకు ఉన్నాయి. ఈ స్థల వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇంతలో కొంత భూమి తమదని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల మధ్య కూడా వివాదం ఉంది. దీంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి బల్దియా అధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడం లేదు. అయినప్పటికి అక్కడ వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగిపోతూనే ఉంది. హైటెక్‌ సిటీకి దగ్గరలోని గురుకుల్‌ ట్రస్టు పరిధిలో, హఫీజ్‌పేటలో కూడా ఇలానే. ఇలాంటివి నగరంలో 1,21,640 ఇళ్లు ఉన్నట్టు లేక్క తేల్చారు. 49,240 ఇళ్లు ప్రభుత్వ భూమిలోనూ, 52,934 ఇళ్లు నోటరీ భూముల్లో, 8,111 ఇళ్లు వక్ఫ్‌ భూముల్లో, 3,036 ఇళ్లు చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో, 1480 ఇళ్లు నాలాల పరిధిలో, 1338 ఇళ్లు దేవాదాయ భూముల్లో మిగిలినవి ఇతర వాటిల్లో ఉన్నట్టు తేల్చారు. ఇలాంటి వివాదాస్పద భూముల్లో ఇళ్లను నిర్మించుకున్న యజమానుల నుంచి ఎటువంటి ఆస్తి పన్నును వసూలు చేయడం లేదు. ఆస్తి పన్ను వేస్తే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. ఇందులో చాలా ఇళ్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా కమిషనర్‌ బి.జనార్దనరెడ్డి దీనిపై అధికారులతో చర్చించారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారం ఆస్తి పన్ను విధించినంత మాత్రాన సంబంధిత వివాదాస్పద ఇంటిపై యాజమాన్యపు హక్కు దక్కదని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ విషయం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. వీరి నుంచి ఇంటి పన్ను వసూలు చేయడానికి మంత్రి కూడా ఆమోదం తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం నుంచి వర్తించేలా ఇంటి పన్నును వసూలు చేస్తారు. అనుమతి ఇచ్చిన ఇళ్లకు వసూలు చేస్తున్న మొత్తం కంటే రెండు రెట్లు అధికంగా వీరి నుంచి ఆస్తి పన్నును వసూలు చేస్తారు. రెండింతల పన్ను వసూలు చేయడం వల్ల ఏటా రూ.40 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా.

బెజవాడ నుంచి కాశీకి విమాన సేవలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం టిక్కెట్‌ ధర రూ.2500లే

అమరావతి: విజయవాడ నుంచి వారణాసి(కాశీ)కి నేరుగా ప్రత్యేక విమానం అందుబాటులోనికి రానుంది. కేవలం రూ.2500 టిక్కెట్‌ ధరతో కాశీకి చేరుకునేలా ఫిబ్రవరి 17 నుంచి సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. 180మంది ప్రయాణికులు పట్టే భారీ విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ మీదుగా ఈ సర్వీసు వారణాసి చేరుకుంటుంది. ఇప్పటివరకూ వారణాసికి విమానంలో వెళ్లాలంటే ఇక్కడి నుంచి ఎయిర్‌ఇండియా సర్వీసులో దిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మరోటి మారాల్సి వస్తోంది. రైలు, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు 30గంటల పైనే పడుతోంది. నేరుగా విమాన సర్వీసు అందుబాటులోనికి రావడం వల్ల మూడు నాలుగు గంటల్లోనే కాశీకి చేరుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం రైలులో వెళ్లాలన్నా 30గంటల పైగా సమయంతో పాటు, సెకండ్‌ ఏసీలో వెళ్తే రెండు వైపులకూ కలిపి రూ.5,140 అవుతోంది. అదే బస్సులో వెళితే దీనికి రెట్టింపవుతోంది.

ఆన్‌లైన్‌ హంగామా

చిత్రసీమకి సామాజిక అనుసంధాన వేదికలు కీలకంగా మారాయి. తారలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, సినిమాల సమాచారం పంచుకోవడం ఎక్కువైంది. యువ తారలతో పాటు సీనియర్లు కూడా ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నారు. కమల్‌హాసన్‌లాంటి నటులు ఈ ఏడాదే ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా ఆన్‌లైన్‌లో పెద్దయెత్తున హంగామా చేస్తున్నాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రంలోని పాటల్ని ఒకొక్కటిగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు... పాట ఇప్పటికే 70 లక్షల మంది చూశారు. బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఏడాది పవన్‌కల్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, అల్లు అర్జున్‌ ‘సరైనోడు’, ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’, రామ్‌చరణ్‌ ‘ధృవ’, నాగచైతన్య ‘ప్రేమమ్‌’, వెంకటేష్‌ ‘బాబు బంగారం’, ‘గురు’ చిత్రాలకి సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ఆన్‌లైన్‌ని ఓ వూపు వూపేశాయి. రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా పవన్‌కల్యాణ్‌తో పాటు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపైన చేసిన కొన్ని వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి.

దేశసంపదను భక్షిస్తున్న ఎలుకను పట్టాల్సిందే అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ స్పష్టీకరణ మూడేళ్ల క్రితం కుంభకోణాలతో నష్టంపైనే చర్చంతా ఎంత తిరిగొచ్చిందన్నదే ఇప్పుడు ప్రజల్లో ముచ్చట అని వెల్లడి ఆధార్‌ అనుసంధానిత చెల్లింపులకు ‘భీమ్‌’ యాప్‌ ప్రారంభం

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశ సంపదను భక్షిస్తున్న ఎలుకను పట్టుకునేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం పత్రికల నిండా బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం వంటి వాటి కారణంగా ఎంత మొత్తం నష్టం వాటిల్లిందన్నదాని గురించే కథనాలుండేవని, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తం జమయిందన్నదానిపై ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారని అన్నారు. డిజిటల్‌ నగదు ఉద్యమ విజయోత్సవ కార్యక్రమం డిజిధన్‌ మేళాలో శుక్రవారం ప్రధాని పాల్గొని ప్రసంగించారు. వేలి ముద్ర ఆధారంగా ఆధార్‌ అనుసంధాన,ంతో చెల్లింపులకు వీలు కలిగించే కొత్త యాప్‌ ‘భీమ్‌’(BHIM-Bharat Interface for Money)ను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. పేదలు, అణగారిన వర్గాల ఉన్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేరును ఈ యాప్‌నకు పెట్టారు. ప్రస్తుతం ఈ యాప్‌ భద్రతాంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, రెండు వారాల్లో దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని వెల్లడించారు.
ఆశావాదులకు వేల అవకాశాలు
‘‘కొంత మంది నిరాశావాదులు. వారు తమ దైనందిన జీవితాన్ని నిరాశావాదంతో ప్రారంభిస్తారు. నిరాశావాదికి నా వద్ద మందు లేదు. కానీ ఆశావాదులకు నా వద్ద వేల అవకాశాలున్నాయి.’’ అని ప్రధాని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను పట్టారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యపై చురకలు వేస్తూ ‘‘పేదల సంపదను భక్షిస్తున్నందున నేను ఎలుకను బయటకు రప్పించాలనుకున్నాను. దీనిపై మేము వేగిరంగా పని చేస్తున్నాం.’’ అని అన్నారు. ‘‘మూడేళ్ల క్రితం కుంభకోణాల్లో ఎంత నష్టం వాటిల్లిందన్నదే వార్తల ప్రధానాంశంగా ఉండేది. ఇప్పుడు వాపసు ఎంత వస్తున్నదానిపైనే చర్చంతా. ఇదీ తేడా.’’ అని ప్రధాని అన్నారు.
అవినీతి, నల్లధనం సమస్యను ఎదుర్కోవడానికి ప్రజలు కష్టపడి పని చేయడం వల్లే 86శాతం నగదును మార్చగల్గామని చెప్పారు. ‘‘ప్రజలు చూపించిన ఈ శక్తి సామాన్యమైనది కాదు. ఈ శక్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.’’ అని అన్నారు. పేదలకు దేశ వనరులు, సంపదపై అధికారం ఉందన్నారు. ‘‘ఈ యాప్‌ ద్వారా భారతరత్న భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ పేరు భారత ఆర్థికవ్యవస్థలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది.’’ అని ప్రధాని చెప్పారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న భారత్‌.. ఎన్నికల్లో ఈవీఎంలను ఎలా ఉపయోగిస్తుందని ప్రపంచం ఆశ్యర్యపోయిందని ప్రధాని గుర్తు చేశారు. ‘‘భారత్‌ యువ దేశం. 65శాతం మంది వయస్సు 35 సంవత్సరాల లోపే. వారంతా డిజిటల్‌ లావాదేవీలకు మళ్లితే అది చరిత్రాత్మకమే అవుతుంది. భారత్‌ ముఖచిత్రమే మారిపోతుంది. భీమ్‌ యాప్‌.. పేదలు, దళితులు, రైతులు, గిరిజనులకు సాధికారికతను కల్పిస్తుంది.’’ అని చెప్పారు. ప్రభుత్వం 100 కోట్లకు పైగా ఆధార్‌ సంఖ్యలను జారీ చేసిందని, వందకోట్లకు పైగా మొబైల్‌ ఫోన్లు దేశంలో ఉన్నాయని, ఒకసారి దేశం డిజిటల్‌లోకి మారితే చరిత్రను సృష్టిస్తుందని ప్రధాని అన్నారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి రోజుకు కనీసం ఐదు డిజిటల్‌ లావాదేవీలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భీమ్‌ యాప్‌ను ఉపయోగించి ప్రధాని మోదీ ఖాదీ గ్రామోద్యోగ్‌ నుంచి కశ్మీరీ శాలువా, రుమాలు కొన్నారు.

ఇంటర్నెట్ లేకుండా భీమ్ యాప్ :మోడీ

ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో జరిగిన డిజిధన్ కార్యక్రమంలో బీమ్ యాప్ ను ప్రారంభిస్తూ వచ్చే ఏడాది నుంచి ప్రతి ఒక్కరూ రోజుకు 5 డిజిటల్ లావాదేవీలు జరిపితే చాలు దేశం డిజిటల్ మయం మవుతుందన్నారు. దేశంలోని 600 మిలియన్ల మంది భీమ్ యాప్ కు అలవాటు పడతారన్నారు. నగదు, అవినీతి రహిత దేశంగా ఇండియా మారిపోతుందన్నారు. రెండు ఫోన్లు పెట్టుకొని డిజిటల్ పేమెంట్ చేయడం లేదా అని అందరూ అడిగే పరిస్థితి తెచ్చుకోవదన్నారు ప్రధాని.
మూడేళ్ల క్రితం దేశం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. బంగారు పాత్రల్లో తినే దేశాన్ని పేదరికంలోకి నెట్టేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు మోడీ. జనవరి 1 నుంచి చూడండి దేశం మొత్తం భీమ్ యాప్ ద్వారానే డిజిటల్ లావాదేవీలు జరగుతాయన్నారు. కొద్ధి రోజుల్లోనే దేశం మొత్తం డిజిటల్ మయం అయిపోతుందన్నారు. భారత్ లో చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ ని సిస్టమ్ నుంచి తొలగించ గలిగాం అన్నారు. దేశ ఖజానా..పేద ప్రజల చేతుల్లోనే ఉండాలన్నారు.


 డిజిటల్‌ ‘భీమ్‌’ యాప్‌ ప్రత్యేకతలు

 ప్రపంచంలోనే అత్యంత పెద్ద అద్భుతంగా భీమ్‌ యాప్‌ అవతరించబోతోంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అన్ని లావాదేవీలు భీమ్‌ యాప్‌ ద్వారానే జరుగుతాయి.’’
-ప్రధాని మోదీ
 
 
 
డిజిటల్‌ లావాదేవీల దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. వినియోగదారులు తాము కొన్న వస్తువులకు, పొందిన సేవలకు చేయాల్సిన చెల్లింపులను డిజిటల్‌ పద్ధతిలో అత్యంత సరళతరం చేసే యాప్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ ద్వారా డబ్బు వేరొకరికి బదిలీ చేయవచ్చు. వేరొకరి నుంచి స్వీకరించవచ్చు. సెకన్ల వ్యవధిలోనే లావాదేవీలు పూర్తవుతాయి. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) భీమ్‌ పేరుతో దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భద్రతాంశాల పరిశీలనలో ఉంది. మరో రెండువారాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బ్యాంకు ఖాతాను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఈ యాప్‌ పని చేస్తుంది. వస్తువులు కొన్న, సేవలు పొందిన వినియోగదారులు తమ వద్ద ఫోన్‌ కానీ, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కానీ లేకుండా కూడా వ్యాపారులకు డిజిటల్‌ డబ్బు చెల్లించవచ్చు. వ్యాపారుల స్మార్ట్‌ఫోన్లలో భీమ్‌ యాప్‌ ఉంటేచాలు. ఆ ఫోన్‌ను బయోమెట్రిక్‌ రీడర్‌కు అనుసంధానిస్తారు. ఆ యాప్‌లో వినియోగదారుడు తన ఆధార్‌ సంఖ్యను కొట్టవలసి ఉంటుంది. అనంతరం ఏ బ్యాంకు ద్వారా నగదు చెల్లించాలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌ పరికరంపై వేలిముద్రను స్కాన్‌ చేయడం ద్వారా ఆ వినియోగదారుడే అసలు ఖాతాదారుడా కాదా అని నిర్ధారణ అవుతుంది. అంటే వేలిముద్రే పాస్‌వర్డ్‌గా పని చేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించుకున్నందుకు ఎటువంటి సేవా రుసుములుండవు. వ్యాపారులు డిజిటల్‌ లావాదేవీలకు మళ్లడానికి ఇది దోహదం చేయనుంది. ప్రస్తుతం డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు తీసుకోవాలంటే మాస్టర్‌కార్డు, వీసా వంటి సర్వీసు ప్రొవైడర్లకు రుసుములు చెల్లించాల్సి వస్తోంది. భీమ్‌ యాప్‌లోని ప్రధాన అంశాలు
లభ్యత ఎక్కడ?: గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాండ్రాయిడ్‌ ఫోన్లకయితే వర్షన్‌ 8, అంతకన్నా ఎక్కువ వర్షన్లుకు, ఐవోఎస్‌ స్మార్ట్‌ఫోన్లకయితే వర్షన్‌ 5, అంతకన్నా ఎక్కువ వర్షన్లకు అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్‌ఫాంలకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని భాషల్లో అందుబాటులోకి రావచ్చు.
యాప్‌ సైజ్‌: దాదాపు 2ఎంబీ
లావాదేవీల గరిష్ఠ పరిమితి
రోజుకు కనీసం రూ.నుంచి గరిష్ఠంగా రూ.20వేల వరకు బదిలీ చేసుకోవచ్చు. ఒక లావాదేవీపై గరిష్ఠ పరిమితి రూ.పదివేలు.
ఎలా పని చేస్తుంది?
యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక తమ బ్యాకు ఖాతా వివరాలను నమోదు చేసి ఆ ఖాతాకు యీపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. యాప్‌ను ఉపయోగించేవారి మొబైల్‌ నంబరే వారి పేమెంట్‌ చిరునామా అవుతుంది. యూపీఐ పిన్‌ను పొందాలంటే మెయిన్‌ మెనూకు వెళ్లి అందులో బ్యాంకు ఖాతాల ఆప్షన్‌లోకి వెళ్లాలి. ప్రాధాన్య బ్యాంకు ఖాతాకు యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డెబిట్‌/ఏటీఎం కార్డులోని చివరి 6 అంకెలు, కార్డు గడువు ముగిసిపోయే తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ ఫోన్‌కు వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. అప్పటి నుంచి ఈ యాప్‌.. డబ్బు పంపడం, స్వీకరించడం వంటి లావాదేవీలను అనుమతిస్తుంది.
ప్రస్తుతానికి ఒక బ్యాంకుఖాతాకే పరిమితం
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా పలు బ్యాంకులు భీమ్‌ యాప్‌ ద్వారా లావాదేవీలను అనుమతిస్తున్నాయి. ఇతర యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) అప్లికేషన్లు, బ్యాంకు ఖాతాలతో పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకునేలా భీమ్‌ను అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతానికి ఏదైనా ఒక బ్యాంకు ఖాతాకే భీమ్‌ను అనుసంధానించుకోవచ్చు. యాప్‌లో బ్యాంకు ఖాతాను అనుసంధానించేటప్పుడు డీఫాల్ట్‌ ఖాతాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరో బ్యాంకు ఖాతాను అనుసంధానించాలనుకుంటే మెయిన్‌ మెనూలోకి వెళ్లి డీఫాల్ట్‌ ఖాతాను మార్చుకోవాల్సి ఉంటుంది.
 
 

నోట్లకు ఎక్స్‌పైరీ డేట్! ఎన్నినెలలకో తెలుసా…

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మన ప్రధాని మోడీ నల్ల ధనాన్ని రూపుమాపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు కూడా దానికి మద్దతు పలికారు. అయితే ఇప్పుడు లెక్కలు ఎలా ఉన్నాయంటే.రద్దు చేసిన రూ.500 – రూ.1000 నోట్లలో సుమారు 14.5 లక్షల కోట్ల విలువైనవి మళ్లీ డిపాజిట్ల రూపంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయి. రద్దు నాటికి దేశంలో చలామనీలో. లేదంటే నల్లధనంగా మూలుగుతున్న డబ్బు విలువకు ఇది దాదాపు సమానం. అంటే.మోడీ నిర్ణయంతో నల్లధనం ఏమీ బయటపడలేదన్నమాటే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో బయట పడిన కొంత డబ్బు గురించి ఇంత నిర్ణయం తీసుకోవలసియన అవసరం లేదని, అదేదో ముందే దాడులు చేసి పట్టుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మోడీ మొరో ప్లాన్ వేస్తున్నారంట. కొత్తగా వచ్చిన 2000, 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తారని అనుకుంటున్నారు. ఈ నిర్ణయంతో పాటు నోట్లకు ఎక్స్పయిరీ డేట్ ఉంటుందని, అంటే దానిపై అలాంటి తేదీ ఏమీ ముద్రించకపోయినా తయారీ తేదీ ఉంటుందని.. అక్కడి ఆర్నెళ్లలో దాని కాలపరిమితి ముగిసిపోయేలా కొత్త నోట్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్నెళ్ల తరువాత వాటికవే కరిగిపోతాయట. నేషనల్ సైన్స్ రీసెర్చి మిషన్ ఈ టెక్నాలజీ తయారుచేయగా
ఆర్బీఐ దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదేగాని జరిగితే డబ్బుని ఎక్కువ మొత్తంలో ఎవ్వరు ఇళ్ళల్లో పెట్టుకోలేరు. చచ్చినట్టు బ్యాంక్ లో వెయ్యాలి. అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. డీమానిటైజేషన్ ముఖ్యంగా నకిలీ నోట్ల ఏరివేత – ఉగ్రవాద నిరోధానికి బాగా తోడ్పడుతుందని ఆయన చెబుతున్నారు. మరి ఇది నిజంగా అమలులోకి వస్తే దొంగ డబ్బు దొంగలా మెల్ట్ అయ్యి మాయం అయిపోతాది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత.. బాబాకు భారీగా విరాళాలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రలోని ప్రముఖ షిరిడీ సాయి బాబా ఆలయానికి కోట్లలో విరాళాలు అందాయి. ఈ 50 రోజుల్లో సుమారు రూ.31.73 కోట్లు వచ్చినట్లు సాయి సంస్థాన్ శుక్రవారం ప్రకటించింది. హుండీల ద్వారా రూ.18.96 కోట్ల విరాళాలను భక్తులు సమర్పించారు. ఇందులో రూ.4.53 కోట్లు రద్దైన రూ.500, రూ.1000 నోట్లు కాగా రూ.3.8 కోట్లు కొత్త రూ.2000, రూ.500 నోట్లు.
 
షిరిడీ సాయికి మరో రూ.4.25 కోట్లు ఆన్‌లైన్ ద్వారా అందాయి. వీటిలో రూ.2.62 కోట్లు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రాగా, రూ.3.96 కోట్లు డీడీలు, మరో రూ.1.45 కోట్లు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, రూ.35 లక్షలు మనీ ఆర్డర్ల ద్వారా వచ్చాయి. వీఐపీ దర్శనాలు, హారతి పాసుల ద్వారా మరో రూ.3.18 కోట్లు అందాయి. అంతేగాక రూ.73 లక్షల విలువైన 2.9 కిలోల బంగారు ఆభరణాలు, రూ.18 లక్షల విలువైన 56 కేజీల వెండి వస్తువులను భక్తులు సమర్పించారు.
 
షిరిడీ సాయి బాబా ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రోజుకు సగటున రూ.44.38 లక్షల చొప్పున ఏడాదిలో రూ.162 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అయితే పెద్ద నోట్లు రద్దు తర్వాత రోజుకు సగటున రూ.37.92 లక్షల చొప్పున విరాళాలను భక్తులు సమర్పించినట్లు సాయి సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధి సచిన్ తాంబి వివరించారు.

సీఎం అఖిలేష్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన ములాయం

సమాజ్‌వాదీ(ఎస్‌పీ) పార్టీలో సంక్షోభం ముదిరిపోయింది. పార్టీ అధ్య‌క్షుడు ములాయంసింగ్ యాద‌వ్ త‌న కుమారుడు, ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం అఖిలేష్‌యాద‌వ్‌ను పార్టీ నుంచి బ‌హిష్కరించారు. అఖిలేష్‌తోపాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు రాంగోపాల్‌యాద‌వ్‌ను సైతం పార్టీ నుంచి ఆరేళ్ల‌పాటు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ములాయంసింగ్ ప్ర‌కటించారు.
‘అఖిలేష్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. సమాజ్‌వాదీ పార్టీని కాపాడటం నా బాధ్యత, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మీడియా సమావేశంలో ములాయం వెల్లడించారు. సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని తెలిపారు.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని పెంచింది. సీఎం అఖిలేశ్‌ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్‌.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్‌ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్‌ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. నోటీసు జారీ చేసిన కొద్ది గంట‌ల్లోనే అఖిలేష్‌, రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్క‌రించిన‌ట్లు ములాయం ప్ర‌క‌ట‌న చేశారు. తండ్రే కుమారుడ్ని సస్పెండు చేయ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయం ఎన్ని మ‌లుపులు తిరుగుతోందోన‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌తోపాటు రాజ‌కీయ నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
देवी देवता को कौन सा फूल अति प्रिय है ,भगवान को चढ़ता है कौन सा फूल
भगवान अपने भक्त को छप्पन प्रकार का भोग लगा कर पूजा करने के लिए नहीं कहते हैं. वे तो केवल आपके सच्चे भक्ति-भाव से ही प्रसन्न हो जाते हैं.
भगवान श्रीगणेश- आचार भूषण ग्रंथ के अनुसार भगवान श्रीगणेश को तुलसीदल को छोड़कर सभी प्रकार के फूल चढाएं जा सकते हैं। पद्मपुराण आचाररत्न में भी लिखा है कि ‘न तुलस्या गणाधिपम’ अर्थात् तुलसी से गणेश जी की पूजा कभी न करें। गणेश जी को दूर्वा चढ़ाने की परंपरा है। गणेश जी को दूर्वा बहुत ही प्रिय है । दूर्वा के ऊपरी हिस्से पर तीन या पांच पत्तियां हों तो बहुत ही उत्तम है।
भगवान शिव- भगवान शंकर को धतूरे के फूल, हरसिंगार, व नागकेसर के सफेद पुष्प, सूखे कमल गट्टे, कनेर, कुसुम, आक, कुश आदि के फूल चढ़ाने का विधान है। भगवान शिव को केवड़े का पुष्प नहीं चढ़ाया जाता है।
भगवान विष्णु- इन्हें कमल, मौलसिरी, जूही, कदम्ब, केवड़ा, चमेली, अशोक, मालती, वासंती, चंपा, वैजयंती के पुष्प विशेष प्रिय हैं। विष्णु भगवान तुलसी दल चढ़ाने से अति शीघ्र प्रसन्न होते है । कार्तिक मास में भगवान नारायण केतकी के फूलों से पूजा करने से विशेष रूप से प्रसन्न होते है । लेकिन विष्णु जी पर आक, धतूरा, शिरीष, सहजन, सेमल, कचनार और गूलर आदि
सूर्य नारायण- इनकी उपासना कुटज के पुष्पों से की जाती है। इसके अलावा कनेर, कमल, चंपा, पलाश, आक, अशोक आदि के पुष्प भी इन्हें प्रिय हैं।
भगवान श्रीकृष्ण- अपने प्रिय पुष्पों का उल्लेख महाभारत में युधिष्ठिर से करते हुए श्रीकृष्ण कहते हैं- मुझे कुमुद, करवरी, चणक, मालती, पलाश व वनमाला के फूल प्रिय हैं।
भगवती गौरी- शंकर भगवान को चढऩे वाले पुष्प मां भगवती को भी प्रिय हैं। इसके अलावा बेला, सफेद कमल, पलाश, चंपा के फूल भी चढ़ाए जा सकते हैं।
लक्ष्मीजी- मां लक्ष्मी का सबसे अधिक प्रिय पुष्प कमल है। उन्हें पीला फूल चढ़ाकर भी प्रसन्न किया जा सकता है। इन्हें लाल गुलाब का फूल भी काफी प्रिय है।
हनुमान जी- इनको लाल पुष्प बहुत प्रिय है। इसलिए इन पर लाल गुलाब, लाल गेंदा आदि के पुष्प चढ़ाए जा सकते है।
माँ काली – इनको अड़हुल का फूल बहुत पसंद है। मान्यता है की इनको 108 लाल अड़हुल के फूल अर्पित करने से मनोकामना पूर्ण होती है।
माँ दुर्गा- इनको लाल गुलाब या लाल अड़हुल के पुष्प चढ़ाना श्रेष्ठ है।
माँ सरस्वती- विद्या की देवी माँ सरस्वती को प्रसन्न करने के लिए सफेद या पीले रंग का फूल चढ़ाएं जाते यही। सफेद गुलाब, सफेद कनेर या फिर पीले गेंदे के फूल से भी मां सरस्वती वहुत प्रसन्न होती हैं।
शनि देव- शनि देव को नीले लाजवन्ती के फूल चढ़ाने चाहिए, इसके अतिरिक्त कोई भी नीले या गहरे रंग के फूल चढ़ाने से शनि देव शीघ्र ही प्रसन्न होते है।
ध्यान रखने योग्य बातें-भगवान की पूजा कभी भी सूखे व बासी फूलों से न करें।
कमल का फूल को लेकर मान्यता यह है कि यह फूल दस से पंद्रह दिन तक भी बासी नहीं होता।
चंपा की कली के अलावा किसी भी पुष्प की कली देवताओं को अर्पित नहीं की जानी चाहिए।
आमतौर पर फूलों को हाथों में रखकर हाथों से भगवान को अर्पित किया जाता है। ऐसा नहीं करना चाहिए। फूल चढ़ाने के लिए फूलों को किसी पवित्र पात्र में रखना चाहिए और इसी पात्र में से लेकर देवी-देवताओं को अर्पित करना चाहिए।
तुलसी के पत्तों को 11 दिनों तक बासी नहीं माना जाता है। इसकी पत्तियों पर हर रोज जल छिड़कर पुन: भगवान को अर्पित किया जा सकता है।
शास्त्रों के अनुसार शिवजी को प्रिय बिल्व पत्र छह माह तक बासी नहीं माने जाते हैं। अत: इन्हें जल छिड़क कर पुन: शिवलिंग पर अर्पित किया जा सकता है। 🌿🌿

డేంజర్ : 3 గంటల్లోనే కోట్ల అకౌంట్స్ హ్యాక్

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్స్ చేయాలంటూ కేంద్రం విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తోంది. అయితే కార్డ్‌తో లావాదేవీలు జ‌ర‌ప‌డం ఎంత‌వ‌ర‌కు సుర‌క్షితం అనేదే పెద్ద ప్ర‌శ్న‌గా మిగులుతోంది. అంతేకాదు కార్డుతో లావాదేవీలు జ‌రిపితే బ్యాంక్ అకౌంట్ల‌నే హ్యాక్ చేసే కేటుగాళ్లు త‌యార‌య్యారు. ఆ త‌ర్వాత మ‌న‌కు తెలియ‌కుండానే ఖాతాలోని డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఆన్‌లైన్ చోరీల‌కు పాల్ప‌డుతున్నారు హ్యాక‌ర్స్‌.
తాజాగా ఓ ప్ర‌ధాన బ్యాంక్‌నుంచి ప‌లువురి ఖాతాలు హ్యాక్ చేశారు ఐదుగురు యువ‌కులు. ఢిల్లీ ప‌రిస‌రాల్లో ఉన్న గురుగ్రామ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు పెట్టింది పేరు. అక్క‌డే బ‌గ్స్ బౌంటీ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఓ ఐదుగురు యువ‌కుల‌ను నియ‌మించుకుంది. ఈ ఐదుగురు ఏమి చేస్తారో తెలిస్తే నోళ్లెళ్ల బెడ‌తారు. వారి ప‌ని ఓ ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్ల‌ను హ్యాక్ చేయ‌డ‌మే. ఎవ‌రైతూ బ్యాంక్ ఖాతాల‌ను ముందుగా హ్యాక్ చేస్తారో వారికి ల‌క్ష రూపాయ‌లు బ‌హుమ‌తి కూడా ప్ర‌క‌టించింది ఆ కంపెనీ. ఇక రేస్ మొద‌లైంది. ఐదుగ‌రు ఐదు ల్యాప్‌టాప్‌లు తీసుకుని ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కేవ‌లం 3 గంట‌ల్లోనే ఓ ప్ర‌ధాన బ్యాంకుకు సంబంధించిన వివ‌రాల‌న్నిటినీ రాబ‌ట్టి వంద‌ల కోట్ల రూపాయ‌లు తారుమారు చేసేందుకు రూట్ క‌నుగొన్నారు. అంటే అకౌంట్ల‌ను హ్యాక్ చేశారు.
కంగారు ప‌డ‌కండి. బ‌గ్స్ బౌంటీ కంపెనీ నియ‌మించుకుంది నిజ‌మైన కేటుగాళ్ల‌ను కాదు. మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎంత ప‌టిష్టంగా ఉందో ఆన్‌లైన్ సెక్యూరిటీ ఎంత సుర‌క్షితంగా ఉందో తెలిపేందుకు ఈ ఐదుగురు యువ‌కుల‌ను రిక్రూట్ చేసుకుంది. ఈ కుర్రాళ్లు కేవ‌లం 3 గంట‌ల్లోనే మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్నఆన్‌లైన్‌ లొసుగుల‌ను బ‌య‌ట‌పెట్టారు. హ‌ర్జీత్ అనే వ్య‌క్తి ఓ ప్ర‌ధాన బ్యాంక్‌కు సంబంధించిన రౌట‌ర్‌ను హ్యాక్ చేశాడు.
బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఏదైనా లావాదేవీల‌పై ఏమైనా సందేహం క‌లిగినా అది రౌట‌ర్ ద్వారానే జ‌రుగుతాయి. ఇప్పుడు పాస్‌వ‌ర్డ్, రౌట‌ర్‌పై నియంత్ర‌ణ నా చేతుల్లో ఉంది. ఇప్పుడు బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల లావాదేవీలను నేను ఓ ఫేక్ సైట్ క్రియేట్ చేసుకుని అందులోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు. వారు లావాదేవీలు జ‌ర‌పాలంటే లాగిన్ ఐడీ పాస్ వ‌ర్డ్‌లు త‌ప్ప‌కుండా ఇవ్వాలి గ‌న‌క‌.. ఈ ప్రాసెస్‌లో లాగిన్ ఐడీ పాస్‌వ‌ర్డ్‌ను హ్యాక్ చేసేస్తా అని హ‌ర్జీత్ తెలిపాడు.
ఇదే ప‌ద్ధ‌తిని క్రిమిన‌ల్స్ అవ‌లంబిస్తే కొన్ని ల‌క్ష‌ల కోట్లు తారుమార‌య్యే ఆస్కారం ఉంద‌ని హ‌ర్జీత్ తెలిపాడు. త‌మ వెబ్‌సైట్ ఎంత సుర‌క్షితంగా ఉందో ప‌రీక్షించి,  అన్ని ప‌ద్ద‌తుల్లో త‌మ సైట్ల‌ను హ్యాక్‌ చేసి వాటికి ప‌రిష్కారం ఇవ్వాల‌ని చాలా కంపెనీలు ఆహ్వానం పంపుతాయ‌ని హ‌ర్జీత్ పేర్కొన్నాడు.
ఇంట్లో కూర్చొనే చాలా వెబ్‌సైట్ల‌ను హ్యాక్ చేయొచ్చు కానీ అలా చేయ‌మ‌ని,  దేశ‌భ‌ద్ర‌తే త‌మ‌కు ముఖ్య‌మ‌ని క్రిమిన‌ల్ హ్యాక‌ర్స్ నుంచి మ‌న ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట‌ప‌ర‌చ‌డ‌మే త‌మ ప‌ని అని మ‌రో కుర్రాడు జోరీ చెప్పాడు.

రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్ గా ఎట్ హోం ఫంక్షన్

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. నేతలు, ప్రముఖుల రాకతో ప్రెసిడెంట్ హోం సందడిగా మారింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన  ప్రణబ్ … ఇవాళ సాయంత్రం రెండు రాష్ట్రాల నేతలకు విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, డిప్యూటీ సీఎం  మహమూద్ అలీ,  స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు జి.వివేక్, విపక్ష నేతలు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.  రాష్ట్రపతిని కలిసేందుకు ప్రముఖులు కూడా వచ్చారు. ఈ నెల 22న నగరానికి వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. హైదరాబాద్ తో పాటు తిరువనంతపురం, మైసూర్, బెంగళూర్, ఏపీలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ్టితో ప్రెసిడెంట్ వింటర్ టూర్ ముగిసింది. దీంతో రేపు ఉదయం ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లనున్నారు.

జియో కస్టమర్లకు శుభవార్త

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన కస్టమర్లకు అభయమిచ్చింది. టెలికం రంగం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది జియో. కస్టమర్లకు మూడునెలల పాటు ఉచిత వాయిస్, డాటా, ఎస్ ఎమ్ ఎస్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హ్యాపి న్యూ ఇయర్ పేరుతో మరో మూడు నెలలు ఉచిత సేవలు అందిస్తున్నట్టు డిసెంబర్ మొదటి వారంలో వెల్లడించారు ముఖేష్ అంబానీ. దీనిపై ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ కంపెనీలు మండిపడ్డాయి. జియో దెబ్బకు కొన్ని కంపెనీలు మూత పడ్డాయి.
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్  పేరుతో మరో 90 రోజులు పొడిగించిన ఆఫర్ పై ట్రాయ్ లో ఫిర్యాదు చేశాయి రైవల్ కంపెనీలు.  ఈ ఆఫర్ పొడిగింపు నిబంధనల ఉల్లంఘన కిందకు ఎందుకు రాదో వివరణ ఇవ్వాలని రిలయన్స్‌ను కోరింది టెలికం రెగ్యులేటరీ అథారిటీ(TRAI).
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పై వివరణ ఇచ్చింది జియో. తాము ప్రకటించిన రెండు ఫ్రీ ప్యాకేజీలు వేర్వేరని తెలిపింది. వెల్ కం ఆఫర్ ముగిసినా..దానికి రీచార్జ్ చేసుకునే అవకాశం లేదని ప్రకటించింది. హ్యాపి న్యూ ఇయర్ ఆఫర్ లో ఈ అవకాశం ఉందన్నారు. కస్టమర్లు కొనసాగాలనుకుంటే.. మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ట్రాయ్ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చింది జియో.
యమలోకం టు భూలోకం...
* యమలోకంలో హైఅలర్ట్...
* యమపాశము, కాలపాశము, దున్నపోతులు మరిన్నికొనుగొలు...
* యమపూరి సిబ్బందికి సెలవులు రద్దు..
* సెలవుల్లో వున్నవారు తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలు..
* ఉన్నతాధికారులతో యముడు సమీక్ష...

డిసెంబర్ 31 రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమయ్యింది ..ఉన్నతాధికారులతో శుక్రవారం యముడు సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాగి ప్రమాదాల్లో పోయే కుర్రాళ్ళను ఎప్పటికప్పుడు తీసుకువచ్చేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు..అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు...మద్యం అలవాటు వున్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించారు.
.
ఆసుపత్రులు..గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ..మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు ...ఎక్కువుగా తాగే కుర్రాళ్ళను గుర్తించి అవసరమైతే వాళ్ళ బండ్లు వెనక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు...రాత్రి 12 దాటిన తర్వాత భటులకు పనిభారం పెరుగుతుందని అయినా అలసట చెందకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు...ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాబితా సిద్దం చేయాలన్నారు...ఎంతమందిని తీసుకువచ్చినా ఇబ్బంది లేదని యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేసామని చెప్పారు..
.
కుర్రాళ్ళు ఎక్కువుగా వుండే అవకాశం వున్నందున వారి కోసం ఇంటెర్నెట్ సదుపాయం కల్పించామని చెప్పారు...రావడానికి మారం చేసే వాళ్ళపై కటినంగా వ్యవహరించాలన్నారు..గత యేడాది మందు ఎక్కువై కాలవల్లో పడిపోయిన వారిని కూడా భటులు పొరపాటున తెచ్చి తొక్కిసలాటకు కారణం అయ్యారని గుర్తు చేసారు..
.
ఈ సారి అలాంటి తప్పిదం జరగకుండా చూడాలని అన్నారు...కొంత మంది అమ్మ కావాలి నాన్న కావాలి చెల్లిని అక్కని చూడాలి అని ఇబ్బంది పెడతారని వాళ్ళ మాటలు నమ్మవద్దని అన్నారు..వాళ్లకి నిజంగానే ప్రేమ వుంటే అంతలా తాగి బండి నడపరని ఈ విషయాన్ని భటులు గుర్తించాలన్నారు....లక్కీ డ్రాప్ అంటూ వాళ్ళు తాగే చివరి మందు చుక్కలు వాళ్ళ అమ్మ నాన్న కన్నీటి చుక్కలని ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పొద్దని అన్నారు...ఒక్క రాత్రి వారి ఆనందం అయినవారికి ఎన్నో రాత్రుల విషాదమనే విషయాన్ని ఎట్టి పరిస్తితుల్లో వారికి తెలియనివ్వోద్దని యముడు ఆదేశించారు..ఈ సమీక్షలో చిత్రగుప్తుడు, యమలోక ఉన్నతాధికారులు, సీనియర్ పాపులు పాల్గున్నారు...

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.
ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.
శుభం భూయాత్.!

స్థిరమైన ఐశ్వర్యం కోసం…..

ఆకుపచ్చ చీర కట్టుకున్న శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉండే చిత్రపటాన్ని తూర్పు వైపు ఉంచి, రోజూ మహాలక్ష్మి అష్టకం చదవాలి. ప్రతి శుక్రవారం తులసిమాల వెయ్యాలి. దీనివల్ల లక్ష్మి చాంచల్యం తగ్గి స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది.

మనసులోని కోరిక నెరవేరాలంటే……

ఏదైనా మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి 21 రోజులు ఆంజనేయస్వామి చిత్రపటం ముందు సీతారామస్తోత్రాన్ని 11 మార్లు పారాయణ చేయాలి. చివరిరోజు హనుమంతుడికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి.
శ్రీ సీతారామ స్తోత్రమ్
——————-
అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!
రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!
పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!
కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!
చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!
చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!
శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!
దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!
అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!
అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!
ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం.
శ్రీరామ మంత్రం.. పవిత్రం !
|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
సాక్షాత్తు వైకుంఠనాధుడైన శ్రీమన్నారాయణుడు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధం స్వయంగా త్రేతాయుగాన ఎత్తిన అవతారమే శ్రీరామావతారం. సకల దేవతలకు ఆదిమూలం.. సకల జగాలకు ఆరాధ్యదైవం అయిన అంతటి శ్రీహరిమూర్తియే స్వయంగా శ్రీరామునిగా భువికి యేతెంచినాడని పురాణాలు తెలుపుతున్నాయి.
భువిలో నరుడి వలే తనే స్వయంగా కష్టసుఖాలను అనుభవించినట్లు ఈ రామావతారంలోని అంశాలు మనకు తెలుపుతాయి. అంతటి మహిమాన్వితుడైన శ్రీరాముడ్ని పూజిస్తూ జపించే ధ్యానమే ఈ మంత్రం. ఈ మంత్రం అందరికి శుభాలను చేకూర్చడమే కాకుండా.. అన్యాయం కాని.. ఎలాంటి విషయాలైనా సరే మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని జపించి కోరుకుంటే అది నేరవేరుతుందని భక్తుల విశ్వాసం.
సహస్రనామార్చనలకు... సకల మంత్రాలకు ఈ మంత్రం సమానమైనదని భావిస్తారు. ఒక్క శ్రీరామ మంత్రం చాలు ఎన్ని అడ్డంకులనైనా సంతోషంగా, తేలికగా ఛేదించగలరని.. ప్రతీతి.

శనివారం స్వామిని ఇలా పూజిస్తే మీకు పట్టిన శని వదిలి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు..

శనిదోష నివారణ కోసం శనివారం ఆంజనేయ స్వామి పూజ.!
శనిదోషం ఉన్నవారు సదరు దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణకథ ప్రకారం, ఓసారి శని, ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడట.
అప్పుడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర ఏళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది.
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు – శనివారం, మంగళవారం మరియు గురువారం.

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే.. శనివారం శ్రేష్టమైనది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”
అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.
మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి. శనివారవ్రత విధానం : ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

ఐశ్వర్యా రాయి ఆత్మహత్యాయత్నం గురించి లీక్ చేసింది ఎవరో తెలుసా?

ఐశ్వ‌ర్య రాయ్ రీసెంట్‌గా ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేశార‌నే వార్త హల్చల్ చేస్తుంది. కారణం కుటుంబ సభ్యులతో సమస్యల వలనే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందని వార్తలు వస్తున్నాయి. ఈమె సినిమాలో రీ ఎంట్రీ అంత సక్సెస్ కాకపోవడమే కాకుండా, ఇటీవల నటించిన యే దిల్ హై ముష్కిల్‌ సినిమాలో హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో కలిసి కొన్ని ఇంటిమేట్ సీన్‌ల‌లో న‌టించడంతో ఇది వివాదాస్ప‌దంగా మారింది. ఈ విషయంలో అమితాబ్ భార్య జయాబచ్చన్ చలా సీరియస్ గా తీసుకున్నారంట.
 అక్కడ నించి అత్తాకోడళ్ళు ఇద్దరికీ సరిగ్గా పడటం లేదని, ఈ ప్రెజర్ తట్టుకోలేక ఐషూ ఇలా చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇంట్లో అంద‌రూ ఉండ‌డంతో ఆమె సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డింద‌ని బాలీవుడ్ మీడియా క‌బురు. ఆ త‌ర్వాత డాక్ట‌ర్‌ల‌ను పిలిచి ఆమెకు ట్రీట్‌మెంట్ ఇప్పించార‌ట‌. ఇప్పుడు ఆడాక్టర్ తను ట్రీట్మెంట్ చేసిన సంగతి లీక్ చెయ్యడంతో ఈమేటర్ బయటపడిందని సోషల్ మీడియాలోనూ, వెబ్సైట్స్లోను న్యూస్ వస్తుంది… అయితే ఇంతవరకు ఏపెద్దమీడియా ఈన్యూస్ జోలికి వెళ్లలేదు.

husbend భర్తకు పట్టిన బ్లూ పిచ్చి తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే…

ప్రపంచంలో వినేకొద్ది రోజుకో వింత అన్నట్టు ఉంటుంది ఈ వార్త. భర్తకు పట్టిన బ్లూ పిచ్చి తట్టుకోలేక ఓ భార్య విడాకులు కోరింది. అయితే విడాకులు ఇవ్వడానికి ఆ భర్త ఒప్పుకోకపోగా భార్య తన అదృష్టమని వదలను అని అంటున్నాడు. ఇంతకీ అసలు సంగతి ఏమితంటే…
నెలకు లక్షల్లో సంపాదించే నితిన్ విశాల్ సింగ్(36) బ్లూ రంగును ఎక్కువగా ఇష్టపడతాడు. అతని భార్యను కూడా అలానే బ్లూని ఇష్టపడి బ్రతకమని చెప్పాడు. భర్త వింత చేష్టలకు ఆశ్చర్యపోయిన ఆమె విడాకులు కోరింది. దానికి అతను ఒప్పుకోకపోవడంతో… అతని గురించి ఆమె ఆరా తీయడం మొదలు పెట్టింది. అప్పుడు అసలు విషయం బయట పడింది. కొద్ది కాలం కిందట సింగ్ ఓ స్వామిని కలిశాడు. ఆయన ‘బ్లూ’ జీవిత విధానాన్ని అవలంభించాలని సూచించడంతో సదరు టెకీ ఆయన భార్య నవీన(30)ను కూడా అలాగే జీవించాలని ఆర్డర్ వేశాడు.

సింగ్, నవీనలకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఈ జంట డీఎస్ఆర్ లేఔట్ లో సొంత ఫ్లాట్ ను కూడా కలిగివుంది. సాఫీగా వీళ్ళ జీవితం సాగిపోతున్న సమయంలో… తాను స్పిరిచ్యువల్ లైఫ్ అనుభవించాలని అనుకుంటున్నట్లు భర్త సింగ్ భార్యతో చెప్పాడు. ఆ తరవాత అతని అలవాట్లు, పద్దతులు మార్చుకుని… మొత్తం బట్టలు ఓ అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి, భార్యను సాధారణ దుస్తులు కాకుండా ‘బ్లూ’ రంగు దుస్తులే ధరించాలని ఆదేశించారు. అధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టినా.. కార్యాలయానికి మాత్రం నిత్యం వెళ్తునే ఉన్నారు. తన ఇంటి మొత్తాన్ని బ్లూ కలర్ లోకి మార్చివేశారు.  ప్రతి రోజూ తెల్లవారు జామున 2.00 గంటలకు మేల్కొని చన్నీళ్ల స్నానం చేస్తారు. భార్యను కూడా తనతో పాటే నిద్రలేచి మెడిటేషన్ చేయమని కోరతారు.
సింగ్ ను నిశితంగా గమనించిన ఆమె.. ఆయన కలలో వచ్చిన ఓ స్వామిజీ ‘బ్లూ’ జీవితాన్ని ఆరంభించాలని ఉపదేశించినట్లు తెలుసుకుంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతని నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ, సింగ్ అందుకు నిరాకరిస్తుండటంతో పోలీసులు కేసును కోర్టు పంపే యోచనలో ఉన్నారు.

ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం

ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం
శ్రీవారి వజ్రం ….
శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. లక్ష కోట్లు.
రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
11986517_10206685472208272_3340691000872907648_n gold-venky
tiruppathi-crown
gold_crown
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవిందా అంటూ అ స్వామిని చూడటానికి ఎంతో ఆత్రుతగా వెళితే, ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది. అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు, ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు.సమయం సరిపోదు. ఆ ఆపదమొక్కుల వాడిని, అనాధరక్షకుడిని చూస్తుంటే… కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో మనసు పొంగిపోతాది. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసుందాం…
1.శిఖామణి;
 శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.
2.సాలిగ్రామాలు;
 ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు.
3.కంఠసరి;
ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది. మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి.

లక్ష్మీ దేవిని శుక్రవారమే ఎందుకు పూజించాలంటే.?

అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమైన రోజుగా ఎందుకు పేరుమోసింది?
రాక్షసులు కూడా ఆరోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు?
అందునా రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజించడమేమిటి?
ఈ సందేహాలన్నీ వస్తాయి.
ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే ….
రాక్షసుల గురువు శుక్రాచార్యుడు.
ఈ శుక్రాచార్యుల పేరుమీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు.
ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు.
ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది.
లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం వుంది.
లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు.
ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి.
అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు.
ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు.
బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది.
లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు.
ఈ రెండూ ఉంటె ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు

లక్ష్మీదేవి ఆలయాలు మనదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలోని దేవి మూర్తులు కొందరు మహాలక్ష్మీ, రాజ్యలక్ష్మీ మొదలైన పేర్లు కలిగి ఉండటమే సాధారణం. అయితే కేవలం లక్ష్మీదేవి పేరుతోనే ప్రసిద్ధమైన ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మీ ఆలయం ఒక్కటే.ముంబాయి నగరంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయం కూడా ప్రసిద్ధమైనదే కాని ఎందుకనో అది ఆ నగరవాసులకే తప్ప బయట వారికి అంతగా తెలియదనే చెప్పవచ్చు. కాగా, జమ్ము దగ్గర ఉన్న వైష్ణోదేవి ఆలయంలో, లక్ష్మీదేవితో పాటు సరస్వతి, కాళిమూర్తులు కూడా ఉంటాయి. మద్రాసులోని అష్టలక్ష్మీ ఆలయం ఇటీవలది.

ఇవి గాని మీ పర్సులో పెట్టుకుంటే… ధనం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు…

ఈ రోజుల్లో అందరూ పర్సుని వాడటం అనేది కామన్. చిన్న పర్సు నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్ వరకు వాడే వాళ్ళ అందరికి ఉండే అలవాటు ఏమిటంటే… చేతికి ఏది దొరికినా అందులో పెట్టేయడమే. కొన్ని పెట్టడం మంచిదే కాని కొన్ని పెడితే అస్సలు మంచిది కాదు. ఎంత సంపాదించినా డబ్బు ఖర్చు అయిపోవడం లేదా అనుకున్న అమౌంట్ రాక ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇంతకీ ఆ పెట్టకూడని వస్తువులు ఏమిటో చూద్దాం…
  • పర్సులో అనవసరమైన పాత పేపర్లు, ఏటీఎం రిసీప్ట్స్, చాక్లెట్ పేపర్లు, షాప్ బిలల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పర్సును అస్తవ్యస్తంగా పెట్టడం వలన, మన ఆర్ధిక పరిస్థితి కూడా ఇలాగే అస్తవ్యస్తంగా ఉంటుంది.
  • నెగటివ్ ఎనెర్జీ ఇచ్చే ఫోటోలు ఉదాహరణకి అసభ్య ఫోటోలు, దయ్యం పొటోలు, హింస, యుద్ధం ఇలాంటివి ఏవీ పెట్టకూడదు.
  • చిరిగిన పర్సు వాడటం వలన నెగటివ్ ఎనేర్జీ వచ్చి డబ్బు ని నష్టపోతాము.
పర్సులో పెట్టుకోవలసినవి…
లక్ష్మి ఫోటో, శ్రీ యంత్రం, రావి చెట్టు ఆకు, వెండి ఇలాంటివి పెట్టుకోవడం వలన ధనం, అదృష్టం, కుటుంబ సౌక్యం అన్నీ కలుగుతాయి

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?????
“ధనం మూలం ఇదం జగత్” అన్నారు మన పెద్దలు,అయితే లక్ష్మి దేవికి చెంచు లక్ష్మి అని కూడా పేరు ఉంది, అంటే ఆవిడా ఒక చోట స్తిరంగా ఉండదు.అందుకే ఆవిడా అనుగ్రహం పొందాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయ్,అవేమిటో ఇపుడు చూద్దాం.
లక్ష్మి గణపతిని పూజించడం:-
లక్ష్మి గణపతి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఎక్కడైతే అయన పూజింపబదాతాడో,అక్కడ లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది,అంతే కాదు గణపతి పేరు కూడా లక్ష్మి గణపతి అని వచ్చింది.
తామర పువ్వులతో:-
లక్ష్మి అమ్మవారు పాలా సముద్రం నుండి తామర పువ్వుతో బైటకి వచ్చింది,అందుకే ఆవిడకి తామర పువ్వు తో ఆవిడను పూజిస్తే ఎంతో సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది.
ఇంటిని,ఇంటి వాకిలిని శుభ్రంగా ఉంచాలి
హిందూ ధర్మం ప్రకారం గుమ్మము పైన భాగం శక్తి స్వరుపినిగ పూజిస్తే గుమ్మమ్ కింద భాగాన్ని లక్ష్మి దేవిగా పూజిస్తారు అటువంటి గుమ్మానికి మరియు ఇంటి ప్రధాన ద్వారాన్ని మనం పూజిస్తే,అమ్మవారికి మనం స్వాగతం పలికినట్టే.
సాయంత్రం వేళలో నిద్రపోవడం
సాయంత్రం నిద్రపోవడం వల్ల అమ్మవారి కోపానికి గురికావడం ఖాయం అంతే కాకుండా లక్ష్మి దేవి సోదరి ఐన జ్యేష్ట దేవి( ఎవరైతే దరిద్రాన్ని ఇస్తుందో) ఆ దేవతా మన ఇంటికి వస్తుంది,అందుకే సంధ్య వేళల్లో నిద్ర అనేది ఎప్పుడు పోరాదు.

శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని ఈ చక్రంతో ఇలా పూజిస్తే..అమ్మ వారి అనుగ్రహం తో పాటు సిరిసంపదలకు లోటు ఉండదు.

లక్ష్మి దేవి అనుగ్రహం, చక్కటి ఆరోగ్యం కోసం శుక్రవారం రోజు గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ గోమతి చక్రం చూడటానికి శ్రీ మహా విష్ణువు యొక్క ఆయుధమైన శుదర్సన చక్రం ఆకారంలో ఉంటుంది కాబట్టి, లక్ష్మి దేవి యొక్క జన్మ స్థానం అయినటువంటి నీటిలో లభిస్తుంది కాబట్టి లక్ష్మి దేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతీ దాయకమైనదని శాస్త్రాలు వర్ణించడం జరిగింది.
ॐ ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతుంటే.. వాళ్ళందరూ తప్పనిసరిగా గోమతి చక్రాన్ని ఉపయోగిస్తే మంచిది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో గోమతి చక్రాన్ని వేసి, ‘ఓం వం ఆర్యోనికరీ రోగానశేషా నమః’ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించిన తరువాత గ్లాసులో నుంచి గోమాతిచాక్రాన్ని తీసివేసి ఆ నీటిని తీసుకుంటే అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యవంతులం కావడానికి ఎంతో ఆశ్కారం ఉంది.
ॐ రాహు, కేతు, సర్ప దోషాలు ఉన్న వారు శుక్రవారం రోజు పూజ మందిరం లో గోమతి చక్రాలను ఉంచి దానికి పసుపు కుంకుమలను అలంకరిస్తే ఈ దోషాల నుంచి బయట పడవచ్చు.
ॐ చిన్న పిల్లలు దృష్టి దోషంతో బాధ పడతున్నట్టు అయితే గోమతి చక్రాన్ని ఒక వెండి తాయిత్తులో ఉంచి, పిల్లల మేడలో వేస్తే దృష్టి దోషం నుంచి బయట పడవచ్చు.
ॐ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా సంభవించి బాధలు పడే వారు వ్యాపారంలో సింహ ద్వారం ముందు, రెండు గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో అలా వేలాడదియ్యటం ద్వారా, వాటి కిందనుంచి నడవటం వలన వ్యాపారంలో లాభాలు పొందటానికి ఆశ్కారం ఉంది.
ॐ స్త్రీలకు తరచు అబార్షన్లు లాంటివి అవుతుంటే అటువంటి వారు రెండు గోమతి చక్రాలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ధరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ॐ కోర్టు పనులు అలాగే ఏ ఇతర ముఖ్యమైన పనులు మీద బయటకు వెళ్ళినా గోమతి చక్రాని దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది. గృహ నిర్మాణంలో పునాదులలో నాలుగు వైపులా 11 గోమతి చక్రాలను పెడితే ఎలాంటి వాస్తు దోషం ఉండదు.

ధనప్రాప్తికి శ్రీలక్ష్మీ ద్వాదశ నామస్తోత్రం

ధనప్రాప్తికి శ్రీలక్ష్మీ ద్వాదశ నామస్తోత్రం
త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణు వల్లభే
యధాత్వం సుస్థిరా కృష్ణే తధాభవ మయిస్థిరా
ఈశ్వరీ లక్ష్మీ శ్చలాభూతి ర్హరిప్రియా
పద్మా పద్మాలయా సంప్రదమా శ్రీ: పద్మధారిణీ
ద్వాదశైతాని నామాని లక్ష్మీం సంపూజ్య యః పఠేత్
స్థిర లక్ష్మ్యర్చనే తేస్తు పుత్రదారాదిభి: సహ

లక్ష్మీ దేవి కటాక్షం పొందడానికి ఏం చెయ్యాలి.

రోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నీరు పోసి ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత లక్ష్మీ దేవిని తలుచుకుని ఆ నీటిని గుమ్మం ముందు పారపోయాలి.
మీరు ఇంటికి తడిబట్ట సమయంలో ఆ నీటిలో కొంచెం కళ్ళు ఉప్పును కలపాలి. ఇలా కనీసం నెలలో ఒకసారి చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది.
బయట ఎక్కడ నల్ల చీమలు కానీ, తెల్ల చీమలు కానీ ఉన్నచోట వాటికి పంచధార కానీ, బియ్యం పిండి కానీ చల్లాలి.
శ్రీచక్రం..
శ్రీచక్రంలో అమ్మవారికి చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది మాతృకలు స్థాపించబడ్డారు..వీరు అమ్మవారికి అష్టదిగ్భంధనగా ఉన్న రక్షణ కవచాలు
.. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తాం.. వీరిలో తూర్పువైపున బ్రాహ్మీ, దక్షిణమున మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహీ, నైరుతి మాహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారు.. అష్టమాతృకలతో శ్రీయంత్రం అష్టదిగ్భంధనగా చేయబడింది.. దీనికి తంత్రమార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.. శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు సిద్ది పొందినవారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు.. వారే గొప్ప శక్తివంతులు, వారిని ఎంతటి క్షుద్రప్రయోగాలు ఏమీ చేయలేవు..ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన గృహానికి ఆ గృహంలో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు.. ఇలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్టించబడిన శ్రీచక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యం సమర్పించాలి.. మళ్ళీ కలుద్దాం..శివోహం..
మీకు ఎన్నో రహస్య విద్యలు చెప్పాలని ఉంది..కానీ మాకు సమయం చాలడంలేదు శివా..అందువలననే ఎక్కువగా చెప్పలేకపోతున్నాం... కానీ అన్ని విద్యలు తెలుపుతాం...శివోహం
English language...
Sri chakra...

Sri chakra is a form of mystical diagram, this is formed by 9 interlocking triangles that surround and radiant from a central point.
Sri chakra is a symbol of hindu tantra. In this 8 directions are covered by 8 matrikas(goddesses) to protect sri vidya.
All the 8 sides are covered by....
Braahmi, maheshwari, koumari, vaishnavi, vaarahi, maahendri, chamundi, mahalakshmi.
siddhas who acqire the power of srichakra dont have equallent power opposite. They are very strong and no enchantments will harm them.
Any house or any place protected by ashtadigbandhana of srichakra is safe always. For this head of the house should perforn srichakra pooja daily with some offerings.
****om shivai paramatmane namag****

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే

శ్రీరంగేశహృత్కమలస్థితతేజోవిరాజితసురుచిరపావనాకృతిం
స్వీయాలంకృతబ్రహ్మానందభరితమనోహరాముక్తమాల్యదాం
కలికల్మషఘ్నభక్తమనోరధఫలదాయకకరుణాంతరంగిణీం
శ్రీ గోదాదేవి మమ దేహి కరావలంబం

 క్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే ……….!!
👉�శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.
👉�శంకరాచార్యులవారు విరచించిన కనకధారా స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
👉�ఉసిరికాయ దీపంతో శ్రీమహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారింపబడుతుంది.
👉�అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీకమాసంలో ధాత్రి హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి.
👉�అప్పుల బాధనుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీమహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్రపూజ చేయాలి.
👉�ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీమహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు వసూలు అవుతాయి.
👉�ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి ‘శ్రీ’ చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
👉�శ్రీమహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు.
👉�శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది.
👉�ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసిన తరువాత నీళ్ళు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
👉�ప్రతిరోజూ రోజూ పూజా చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది.
👉�ఉసిరికాయ ఊరగాయ పక్కన నివశిస్తున్నవారికి లేదా బంధువుల ఇళ్ళకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతవంతమైన జీవనాన్ని సాగిస్తారు.
👉�ఉసిరికాయను చేతపట్టుకుని సంగమ తీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానం ఇస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు.
👉�ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు.
👉�ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది.
👉�ఉసిరికాయ దీపాలను తులసికోట ముందు వెలిగించినట్లయితే దైవ భక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
👉�కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.
👉�శ్రీ గణపతి హోమంలో శక్తిగణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తె అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి.
👉�కమలాక్షి మణితో శ్రీమహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తరువాత పండు ముత్తైదువుకి (60 సంవత్సరాలు పైబడిన) తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు…..�
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు ,

శబాష్ శ్రీలక్ష్మి....వాట్సప్‌ వేధింపులపై పవర్‌పంచ్!

‘నన్ను ఎప్పుడు రమ్మంటావు? నీ ‘‘రేటు’’ ఎంత’’?.... ‘‘రూ.3000 సరిపోతుందా? ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేయమంటావా?’’... కేరళలలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ శ్రీలక్ష్మి సతీష్‌కు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి తరచూ వస్తున్న కాల్స్ ఇవి... అది మొదలు అనేక మంది మానవ మృగాల నుంచి ‘‘రేటు’’ అడుగుతూ వరుసగా కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలైంది. మరొకడు రూ.25వేలు ఇస్తాను రమ్మంటూ వేధించాడు. దీంతో శ్రీలక్షి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. అయితే మరో గంటలోనే షాక్ నుంచి తేరుకుని ఎవరైతే ఫోన్లు చేశారో వారిలో ఒకరి నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆమె తన హోదా గురించి చెప్పే సరికి అతగాడు గజగజ వణికిపోయాడు. క్షమించమంటూ వేడుకున్నాడు. ఇతనొక్కడికే కాదు... సదరు వాట్సాప్ గ్రూప్‌లోని సంభాషణల ద్వారా ఈ మొత్తానికి కారణమైన మృగాడి ఫోన్ నంబర్ కూడా కనిపెట్టారామె. ఆయా సంభాషణలను స్క్రీన్‌షాట్ తీసి ఫొటోలు సంపాదించారు. ఈ గ్రూప్‌లో తన ఫోన్ నంబర్ పోస్టు చేసిన వ్యక్తి... ఓ జాతీయ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడని గుర్తించారు. బయటికి మంచి వ్యక్తిలా నటిస్తూ... నీచంగా ప్రవర్తిస్తున్న అతడిపై ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం పసిగట్టిన సదరు పార్టీ కార్యకర్తలు ఆమెకు ఫోన్ చేసి కాళ్లబేరానికి వచ్చారు. క్షమాపణ చెబుతూ.. కోర్టుబయటే రాజీ కుదుర్చుకుందామని బతిమాలారు. అయితే అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని, బహిష్కరించినదానికి రుజువుగా పార్టీ సమావేశం మినిట్స్‌ను తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. దీంతో ఆ యువనేత తండ్రి శ్రీలక్ష్మిని కలుసుకుని పోలీసుకు ఫిర్యాదు చేయవద్దంటూ వేడుకున్నారు. దీంతో ఏదయినా స్వచ్ఛంద సేవా సంస్థకు రూ.25 వేల విరాళం ఇచ్చి... రసీదు తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి వారికి సూచించారు. అలా చేసినప్పటికీ శ్రీలక్ష్మి తన కోపం చల్లారక ఈ వృత్తాంతం మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో... నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 1300 మందికి పైగా షేర్ చేసుకోగా 1200 మంది ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. 4500 మంది లైక్ చేశారు.
శనిదోష నివారణ కోసం శనివారం ఆంజనేయ స్వామి పూజ.!
శనిదోషం ఉన్నవారు సదరు దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణకథ ప్రకారం, ఓసారి శని, ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడట.
అప్పుడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర ఏళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది.
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు – శనివారం, మంగళవారం మరియు గురువారం.

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే.. శనివారం శ్రేష్టమైనది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”
అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.
మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి. శనివారవ్రత విధానం : ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

సాయంత్రం వేళ ఈ పనులు చేయకండి.. చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహనికి గురికాక తప్పదు..!

పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు, నిబంధనలు పెట్టారు. అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు, నమ్మకం లేని వాళ్ళు పాటించరు. అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం సమయంలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. మనకు ఉన్న కొన్ని అలవాట్లు.. మనపై, మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట. హిందువుల ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా చేసినప్పుడు.. సంపద, శ్రేయస్సు ఎప్పటికీ.. మీ ఇంటిని వదిలివెళ్లదు.
సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి. మీకు తెలుసా? మీకున్న చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను వెంటనే మార్చేస్తాయి. మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం..
తులసిని పూజించకూడదు:

హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసీని పూజించడం,ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. తులసి మొక్కను పూజించడం, నీళ్లు పోయడం చాలా పవిత్రంగా భావిస్తాం. కానీ.. సాయంత్రంపూట ఇది మంచిది
నెయ్యి దీపం వెలిగించొచ్చు:

సూర్యాస్తమయం తరివాత తులసిని పూజించకూడదని బాధ పడుతున్నారా? చింతించకండి సూర్యాస్తమయం తరువాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించొచ్చు. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే.. లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షించవచ్చు.
చెత్త ఊడవకూడదు:
సూర్యాస్తమయం తరువాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల.. మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట. ఈ విషయం చాలా మంది ఆడవాళ్ళకు తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళు ఇక నుంచి ఈ పని చెయ్యకండి.
శృంగారం చెయ్యకూడదు:
సాయంత్రం సమయంలో.. సెక్స్ చెయ్యడం, శారీరకంగా కలవడం వంటి పనులు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. సాయంత్రం సమయంలో శారీరక సంబంధం.. దురదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి శృంగార ప్రియులు ఇక నుంచి ఆ పనులు పగటి పూటే కానిచ్చేయండి.
నిద్రపోకూడదు:
ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసిన పెద్దగా పట్టించుకోరు. సూర్యాస్తమయం సమయంలో.. నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు, నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే సాయంత్రం పూట నిద్రపోతే.. ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలకు.. కారణం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక నుండి సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకండి.
తిన్న వెంటనే కడిగేయాలి:
ఆహారం తిన్న వెంటనే.. పాత్రలు శుభ్రం చేయకపోతే.. శని, చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే.. అన్నం తిన్నవెంటనే ప్లేట్ శుభ్రం చేయడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు. కాబట్టి ఇక నుంచి తిన్న వెంటనే శుభ్రం చేసేయండి.
చదువుకోకూడదు:
ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు, సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోకూడదు అట. ఎందుకంటే పురాణాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.
ఆటలు ఆడితే చాలా మంచిది:
సాయంత్రంపూట ఇంట్లో కూర్చుని చదువుకోవడం కన్నా.. పిల్లలు బయట ఆడుకోవడం లేదా, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం చాలా మంచిదట. ఇది ఎలాగో పిల్లలు చేసేదే. అయితే కొంతమంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని ఆటలకు పంపించారు. ఈ విషయం ఆ తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి.
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి:
మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో, ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల.. మీ చుట్టు పక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. కాబట్టి ఇక నుంచి ఇలాంటి పనులు చేసే వాళ్ళు మానుకోండి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..
లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్లు.. ధనంతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే.. ఎక్కడైతే.. ఎక్కువ భక్తి, అనుకూలంగా ఉంటుందో.. అక్కడికి లక్ష్మీదేవి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఎప్పుడూ.. లక్ష్మీదేవిను పూజిస్తూ ఉండాలి.

వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసముంటే..?

వైకుంఠ ఏకాదశీ వ్రతం” ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.
ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు.
ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది

తొలి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన చరిత్ర

మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’ విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమాయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సారమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటికాలమైతే, దక్షిణాయణం రాత్రికాలమని చెప్పబడుతోంది. విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశినుండి నాలుగునెలలపాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘శయన ఏకాదశి’ (తొలిఏకాదశి) అని అన్నారు. తొలి ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ద ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనినిన్ ‘ఉత్థాన ఏకాదశి’ అని అన్నారు.
తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ‘ఏకాదశి’. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ‘ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు.’ చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓపర్వదినమనే చెప్పొచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు, శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి, ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు, వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా పారిపోగా, వారి దేవేరులంతా ఒక ఉసిరిచెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెదుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెదకడానికి ప్రయత్నిస్తుండగా, దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టుతొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుడిని సంహారించింది. ఆ కన్యక పేరే ‘ఏకాదశి’, అప్పట్నుంచి ప్రతి పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది.
ఏకాదశి మహాత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడ ధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మొహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.
ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరుపబడుతుంటుంది. మన తెలుగువాళ్ళు ఈ పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుచుకుంటూఉంటారు. ఈ రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలువబడుతోంది అంటారు. స్వామి భూలోకానికి దిగి రావడం వెనుక ఓ ఉదంతం ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ, దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను తట్టుకోలేక పోయిన దేవతలు, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి వచ్చి మురాసురుని సంహరించాడు. ఆ సంహారం ఏకాదశినాడు జరిగినందువల్ల, ఈ రోజుకి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది

వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మరిచిపోకండి..

వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మరిచిపోకండని పండితులు సూచిస్తున్నారు. మహావిష్ణువుకు తులసిదళాలు ఎంతో ప్రీతికరమైనవి. వివిధరకాల పూలతో స్వామిని పూజించడం వలన కలిగే ఫలితం, కేవలం తులసిదళాలతో పూజించడం వలన కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ‘ముక్కోటి ఏకాదశి’ రోజున స్వామివారిని అనేక రకాల పూలతో అలంకరించడం, అర్చించడం జరుగుతుంది. ఆ రోజున పూజలోను ‘తులసి’ విశిష్టమైన పాత్రనే పోషిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం, ఉపవాస జాగరణలనే నియమాలను పాటించడంతో పాటు తులసిదళాలతో పూజించడం శుభప్రద ఫలితాలను ఇస్తుంది.
ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోయినవాళ్లు, వైష్ణవ సంబంధమైన ఆలయాలను దర్శించడం వలన … తులసిదళాలతో స్వామివారిని అర్చించడం వలన కూడా పుణ్యఫలరాశి పెరుగుతుందనీ, మోక్షానికి అవసరమైన అర్హత ప్రసాదించబడుతుందని చెప్పబడుతోంది.
అందువలన వైకుంఠ ఏకాదశిగా పిలవబడుతోన్న ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు జరిపే పూజలో తులసిదళాలు ఉండేలా చూసుకోవడం మరచిపోకూడదని పండితులు అంటున్నారు.

కేసీఆర్‌తో నా విందు.. పాయసం.. కొంగ కథే!


  • ప్రణబ్‌ విందుకు మమ్మల్ని ఆహ్వానించరా?
  • గవర్నర్‌ తీరు దుర్మార్గం: రేవంత్
హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌తో తన విందు అంటే పాయసం, కొంగ కథ అవుతుంద ని టీడీఎల్పీ నేత రేవంతరెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్‌ నన్ను విం దుకు పిలిచినా.. విందుకు ఆయన మా ఇంటికి వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది’’ అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘విపక్షనేతల్లో ఒకరైన మీ ఇంటికి సీఎం కేసీఆర్‌ వస్తే ఎలాంటి విందు ఇస్తారు?’’ అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ఇచ్చిన విందుకు విపక్ష నేతలను ఆహ్వానించకపోవటాన్ని రేవంతరెడ్డి తప్పుబట్టారు. దీనిపై గతంలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన నరసింహన్‌ను రాష్ట్ర గవర్నర్‌గా నియమించే వీల్లేకున్నా నరసింహన్‌ కొనసాగుతున్నారన్నారు.

ఖైదీ నెంబర్‌ 150’ సెన్సార్‌ టాక్‌!

ప్రస్తుతం సెన్సార్‌ టాక్‌ అనేది కూడా పబ్లిసిటీ వ్యవహారంగానే మారిపోయింది. తమ సినిమా చూసి సెన్సార్‌ సభ్యులు బాగుందన్నారని ప్రచారం చేసుకుంటూ పబ్లిసిటీ షురూ చేస్తారు సినిమా జనాలు. తాజాగా సంక్రాంతికి విడుదల కానున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ సెన్సార్‌ టాక్‌ అంటూ ఓ రిపోర్ట్‌ బయటకి వచ్చింది. ఈ రిపోర్టును మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు.
 
ఆ వార్తల ప్రకారం ఈ సినిమా చూడడానికి ఎప్పుడూ లేనంతగా మొత్తం 18 మంది సెన్సార్‌ సభ్యులూ హాజరయ్యారట. సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారట. మెగాస్టార్‌ డ్యాన్స్‌లకు, యాక్టింగ్‌‌కు అందరూ ఫిదా అయ్యారట. ఈ సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువగా ఉండడంతో ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చారట. అలాగే సినిమా రన్‌ టైమ్‌ 147 నిమిషాలు ఉందట.
శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం:
శ్రీ దేవీ ప్రార్థన:
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||
అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ |
ధ్యానమ్:
ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||
లమిత్యాదిపంచ పూజామ్ కుర్యాత్, యథాశక్తి మూలమంత్రమ్ జపేత్ |
లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః
రం – తేజస్తత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః
శ్రీ దేవీ సంబోధనం (1) :
ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రి పురసుందరీ,
న్యాసాంగదేవతాః (6)
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,
తిథినిత్యాదేవతాః (16)
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,
దివ్యౌఘగురవః (7)
పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ,
సిద్ధౌఘగురవః (4)
కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,
మానవౌఘగురవః (8)
విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,
శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,
శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,
శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,
శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,
శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,
శ్రీచక్ర సప్తమావరణదేవతాః
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,
శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,
శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,
నవచక్రేశ్వరీ నామాని
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,
శ్రీదేవీ విశేషణాని – నమస్కారనవాక్షరీచ
మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |
ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ||
లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||
అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ||
మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ||
తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||
సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||
ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్ |
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ||
ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||
లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||
అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ |
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||
మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ||
తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||
|| ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్త