Friday 30 December 2016

ఓం శ్రీమాత్రే నమః

అమ్మ మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి?

  ప్రతి రోజు సాయంత్రం / ప్రదోష కాలం లో అమ్మవారు , శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అంట.

ఈ సమయమా లో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇన్స్టం అంట.

  అవి ఆర్ద్రనతకరి అని , అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం.

ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరమ్.

  ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం , వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది.

  ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీదలు ఉండవు , రోగ నివారణ , అప్పులు , రుణాలు తీరిపొతాయి అని , కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు.

ఎవర్ని అయితే అమ్మవారు కరునిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట.

🍀 పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపమ్ గా చెపుతారు.

  కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి క్రుపకి పత్రులు కావచ్చు.

  నవరాత్రి ద్వయం అంటే సేరనవరత్రులు ( దుస్సేర నవరాత్రి ) , వసంత నవరాత్రులు ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

  వసత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇన్స్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేసవరే , స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు.


  అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?

  కాలి , చండి , బాల, లలిత , దుర్గ అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది , కరుణిస్తుంది అని అనుమానం?
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది .

  మాత్రు రుపం , శాంతి రూపం , ఆకలి రూపం లో , జాతి రూపం లో , చైతన్య స్వరూపం , నిద్ర రూపం లో , దయా రూపం లో , బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉంది మానని నడిపిస్తుంది.

అమ్మవారిని ఏమి కూరుకోవాలి?

  కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కొరతమ్.

  కానీ ఏది కోరిన మల్లి దాని వలన కలిగే సుకం అల్పం , క్షణికం .

అది తీరగానె మల్లి ఇంకో కోరిక వస్తుంది.

మరి ఏమి కోరాలి ? శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు , నాతో ఉండు" మోక్షం వద్దు , విద్య వద్దు , సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు , నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి , ఎప్పుడు కరునిస్తూ ఉండాలి , నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని కోరుకోవాలి.

No comments:

Post a Comment