Thursday 29 December 2016

పెద్ద‌ప‌ల్లి – నిజామాబాద్ రైల్ స‌ర్వీస్ స్టార్ట్

ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న పెద్ద‌ప‌ల్లి, నిజామాబాద్ జిల్లాల ప్ర‌జ‌ల క‌ల ఫ‌లించింది. సికింద్రాబాద్ నుంచి పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ రూట్లో రైలు స‌ర్వీసును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. మ‌రో రైలు స‌ర్వీసును క‌రీంన‌గ్‌-లింగంపేట్- జ‌గిత్యాల నుంచి మోర్తాడ్ వ‌ర‌కు పొడ‌గించారు. ఈ మార్గానికి మ‌రో 25 కిలోమీట‌ర్లు మార్గం పూర్త‌యితే ఐదు జిల్లాల ప్ర‌జ‌ల‌కు లాభం చేకూర‌నుంది. ఢిల్లీలో రైలు స‌ర్వీసును రిమోట్ ద్వారా సురేష్ ప్ర‌భు ప్రారంభించిన కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ,నిజామాబాద్ ఎంపీ క‌విత పాల్గొన్నారు. ద‌శాబ్దాల క‌ల నెర‌వేర‌డంతో ఆ ప్రాంత ప్ర‌జ‌ల్లో ఆనందం వెల్లివిరిసింది.

No comments:

Post a Comment