Friday 30 December 2016

రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్ గా ఎట్ హోం ఫంక్షన్

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. నేతలు, ప్రముఖుల రాకతో ప్రెసిడెంట్ హోం సందడిగా మారింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన  ప్రణబ్ … ఇవాళ సాయంత్రం రెండు రాష్ట్రాల నేతలకు విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, డిప్యూటీ సీఎం  మహమూద్ అలీ,  స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు జి.వివేక్, విపక్ష నేతలు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.  రాష్ట్రపతిని కలిసేందుకు ప్రముఖులు కూడా వచ్చారు. ఈ నెల 22న నగరానికి వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. హైదరాబాద్ తో పాటు తిరువనంతపురం, మైసూర్, బెంగళూర్, ఏపీలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ్టితో ప్రెసిడెంట్ వింటర్ టూర్ ముగిసింది. దీంతో రేపు ఉదయం ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లనున్నారు.

No comments:

Post a Comment