Thursday 29 December 2016

మహేశ్‌బాబు ఫ్యామిలీ ట్రిప్‌లో రామ్‌చరణ్‌

ఎక్కడ చూసినా ఇప్పుడు విహారయాత్రల సీజన్‌ నడుస్తోంది. ఈసారి నటుడు మహేశ్‌బాబు తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతోపాటు గల్లా జయదేవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ వెళ్లారు. అక్కడే క్రిస్మస్‌ వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫ్యామిలీ ఫొటోను గల్లా జయదేవ్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.
తాజాగా మహేశ్‌ తన విహారయాత్రలో భాగంగా తీసిన ఫొటోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘సరిహద్దులు దాటి.. హ్యాపీ హాలిడేస్‌’ అని నవ్వుతూ ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలో మహేశ్‌ ఫ్యామిలీతోపాటు రామ్‌చరణ్‌ కూడా ఉండటం విశేషం. ఇదే ఫొటోను చెర్రీ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘విహారయాత్రలో.. సరిహద్దులు దాటి! హ్యాపీ హాలిడేస్‌ గాయ్స్‌’ అని రాశారు. దీని బట్టి మహేశ్‌, చెర్రీ విహారయాత్రకు ఒకే ప్రదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment